కార్తీకదీపం సీరియల్ నటుడు ప్రేమ్ ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. రీల్ లైఫ్లో అనుకునేరు.. రియల్ లైఫ్లో. శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్ గన్తో సీరియల్ నటుడు మనోజ్ కుమార్ సిద్దార్థ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఎయిర్ గన్ పిల్లెట్స్ తగిలి సిద్ధార్థ కు గాయాలయ్యాయి.
మనోజ్ భార్యతో ఉన్న వివాహేతర సంబంధమే కాల్పులకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ్ను చంపాలని ముందుగానే నిర్ణయించుకున్న మనోజ్ కుమార్ క్లబ్ లోకి ఎయిర్ గన్ తీసుకెళ్లాడని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారిస్తున్నారు. కాగా.. మనోజ్ కుమార్ మౌనరాగం సీరియల్తో పాటు కార్తీక దీపం సీరియల్లో ప్రేమ్గా నటించాడు.