శ్రీశైలం కార్తీకపౌర్ణమి రెండోవ సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రం భక్తులతో కిటకిట లాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. గంగాధర మండపం,ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిస్తున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న వేలాదిమంది భక్తులు దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నది. శివనమస్మరణతో శ్రీశైల ముక్కంటీ క్షేత్రం మారుమోగుతున్నది.
next post