డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని స్వేరోస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ నాగేష్ పిలుపునిచ్చారు. మంగళవారం కల్వకుర్తి టిఎస్ యుటిఎఫ్ భవనంలో జరిగిన స్వేరోస్ కల్వకుర్తి డివిజన్ నూతన కమిటీ ఏర్పాటుకు ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో పాఠశాలలు ప్రారంభించే పరిస్థితి లేనందున ప్రతి గ్రామంలో గ్రామ అభ్యాసన కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞాన సమాజ నిర్మాణం కొరకు పాటుపడాలని, మహనీయులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ విద్యావ్యవస్థలో గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ సమూల మార్పులు తెచ్చారని అన్నారు. నేడు భారతదేశం మొత్తం తెలంగాణ గురుకుల వైపు చూస్తుందని తెలిపారు. అనంతరం కల్వకుర్తి స్వేరోస్ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రవీంద్రనాథ్ ను అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గా జహీర్ ఉపాధ్యక్షుడుగా గోరేటి నాగేష్ నరేష్ అరుణ్ శంకర్ ఆనంద్ బాల జంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కోశాధికారి మల్లేష్ కార్యదర్శి బాల జంగయ్య లతోపాటు పడకండి వెంకటేష్ చంద్రకాంత్ శ్రీశైలం సురేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు