ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హిందూత్వాన్ని రక్షిస్తుందా లేదా తేల్చి చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఆగ్రహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందూ ఆలయాలు పై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందారని ఆయన అన్నారు.
బిట్రగుంట, పిఠాపురం లో కూడా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయని, అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలు పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలు పై ఒక కమిటీ వేస్తామని ఆయన అన్నారు.