టాంజానియాలోని విమానాశ్రయంలో ప్రయాణీకుల విమానం ల్యాండ్ అవుతుండగా సరస్సులో కూలిపోయింది. ప్రెసిషన్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్ విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా పైలట్ నియంత్రణ కోల్పోయాడని, ఎయిర్పోర్ట్ సమీపంలోని విక్టోరియా సరస్సులో విమానం కూలిపోయిందని సమాచారం. విమానం దార్ ఎస్ సలామ్ నుంచి బుకోబా వయా మవాంజా మీదుగా వెళ్తోంది. బుకోబా విమానాశ్రయంలోని రన్వేలో కొంత భాగం ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు అయిన విక్టోరియా సరస్సు పక్కనే ఉంది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టాంజానియా మీడియా నివేదికల ప్రకారం, విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో 19 మంది మరణించినట్లు సమాచారం. ఇందులో ఇద్దరు పైలట్లను కూడా ఉన్నారు. చెరువులో పడిన 26 మందిని రిలీఫ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కగేరా ప్రావిన్స్కు చెందిన పోలీసు కమాండర్ విలియం మ్వాంపాఘలే మాట్లాడుతూ, తాము పెద్ద సంఖ్యలో ప్రజలను రక్షించగలిగామని చెప్పారు. విమానం దాదాపు 100 మీటర్లు (328 అడుగులు) ఎత్తులో ఉన్న సమయంలో చెడు వాతావరణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన వివరించారు. వర్షం కారణంగా విమానం నీటిలో పడిపోయింది.