భద్రాచలం రామాలయంలో భక్తులందరికీ అన్నదానం చేయనున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య అధికంగా వస్తున్నందున అన్నదానం టికెట్లు దొరక్క చాలామంది నిరాశ చెందుతున్నారు.
ఈ ఇబ్బందిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుండి ఆలయంలో సంఖ్యతో సంబంధం లేకుండా నిత్యాన్నదానం చేయాలని నిర్ణయించింది.
భక్తులందరికీ ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు ఎంత మంది వస్తే అంత మందికి ఉచితంగా భోజనం పెడతామన్నారు.
ఇందుకోసం బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు.