40.2 C
Hyderabad
May 5, 2024 16: 14 PM
Slider వరంగల్

గొత్తికోయ కుటుంబానికి తస్లీమా అండ

#taslima

కన్న కొడుకులను కోల్పోయి,కడుపుకోతతో దయనీయ స్థితిలో ఉన్న క గొత్తికోయ కుటుంబానికి ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ దాతల సహకారంతో అండగా నిలిచారు. మంగపేట మండలం కొత్తూరు, మొట్లగూడెం గొత్తికొయాగూడం కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్న పిల్లలు బస్సు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి కడుపుకోత మిగిలింది. ఆ కుటుంబానికి సాయం చేయాలనే సదుద్దేశంతో ఏటూరునాగారానికి చెందిన బ్లడ్ డోనార్స్ ఆధ్వర్యంలో చేపట్టిన సహకారానికి తస్లీమా తన వంతు సాయం చేశారు.

ఆదివారం వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, దాతల సహకారంతో వచ్చిన 50 వేల రూపాయలను తస్లీమా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. పేదలకు సాయం చేయాలనే సదుద్దేశంతో బ్లడ్ డోనార్స్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని, ఆపద సమయంలో యువత ముందుకు రావాలని తస్లీమా అన్నారు. అనంతరం పిల్లలకు పండ్లు, బిస్కెట్స్ అందించారు. తస్లీమా వెంట బ్లడ్ డోనార్స్ సభ్యులు వహీద్,హరీష్, ప్రభాకర్, సంతోష్,నరేష్, సతీష్,ఖాజా పాషా,నరేష్,కిరణ్,సతీష్,కిరణ్  తదితరులు ఉన్నారు.

Related posts

గాడ్స్ సన్: సెంచరీలు దాటే వయసు సంస్కృతం నేర్పే మనసు

Satyam NEWS

డిసెంబర్ వరకూ 10 కిలోల బియ్యం ఉచితం

Satyam NEWS

ఐఏఎస్ అధికారులపై అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment