కన్న కొడుకులను కోల్పోయి,కడుపుకోతతో దయనీయ స్థితిలో ఉన్న క గొత్తికోయ కుటుంబానికి ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ దాతల సహకారంతో అండగా నిలిచారు. మంగపేట మండలం కొత్తూరు, మొట్లగూడెం గొత్తికొయాగూడం కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్న పిల్లలు బస్సు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి కడుపుకోత మిగిలింది. ఆ కుటుంబానికి సాయం చేయాలనే సదుద్దేశంతో ఏటూరునాగారానికి చెందిన బ్లడ్ డోనార్స్ ఆధ్వర్యంలో చేపట్టిన సహకారానికి తస్లీమా తన వంతు సాయం చేశారు.
ఆదివారం వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, దాతల సహకారంతో వచ్చిన 50 వేల రూపాయలను తస్లీమా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. పేదలకు సాయం చేయాలనే సదుద్దేశంతో బ్లడ్ డోనార్స్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని, ఆపద సమయంలో యువత ముందుకు రావాలని తస్లీమా అన్నారు. అనంతరం పిల్లలకు పండ్లు, బిస్కెట్స్ అందించారు. తస్లీమా వెంట బ్లడ్ డోనార్స్ సభ్యులు వహీద్,హరీష్, ప్రభాకర్, సంతోష్,నరేష్, సతీష్,ఖాజా పాషా,నరేష్,కిరణ్,సతీష్,కిరణ్ తదితరులు ఉన్నారు.