గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ సభ్యులు బుద్ధా వెంకన్న పై వైసీపీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన వ్యక్తిని తురక కిషోర్ గా గుర్తించారు. అతను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు.
జగన్ పాదయాత్రలో ఆయనతో కలిసి కిషోర్ నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కిషోర్ ఆగడాలు పెరిగిపోయాయని స్థానిక నాయకులు అంటున్నారు. నేడు తెలుగుదేశం నాయకులపై అతను పట్టపగలే దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని తెలుగుదేశం పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.