ఆర్ధికంగా చితికిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ నిలిపివేశారు. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేశారు.
కొవిడ్ లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది.
రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కూడా కరవు భత్యాన్ని (DA) నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.