28.7 C
Hyderabad
May 5, 2024 10: 05 AM
Slider ప్రత్యేకం

తెలుగుదేశం నాయకులపై వైసిసి వేటాడి దాడి

attack on TDP

విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దారుణంగా రక్తం వచ్చేలా కొట్టారు. వారితో బాటు ఉన్న ఒక న్యాయవాది చొక్కా మొత్తం రక్తసిక్తం అయింది.

మాచర్లలో తెలుగుదేశం నాయకులు నామినేషన్లు వేయడంలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వెళ్లిన బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు అక్కడకు చేరుకోకుండానే దాడికి గురయ్యారు. పట్టపగలు నడి రోడ్డుపై కారు అద్దాలు ధ్వంసం చేసి నాయకులపై దాడి చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

Related posts

రానా విరాట ప‌ర్వం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sub Editor

వడ్డికాసులవాడికి పెరుగుతున్న ఆదాయం

Satyam NEWS

N440K కరోనా వైరస్: మంత్రిపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment