విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దారుణంగా రక్తం వచ్చేలా కొట్టారు. వారితో బాటు ఉన్న ఒక న్యాయవాది చొక్కా మొత్తం రక్తసిక్తం అయింది.
మాచర్లలో తెలుగుదేశం నాయకులు నామినేషన్లు వేయడంలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వెళ్లిన బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు అక్కడకు చేరుకోకుండానే దాడికి గురయ్యారు. పట్టపగలు నడి రోడ్డుపై కారు అద్దాలు ధ్వంసం చేసి నాయకులపై దాడి చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.