40.2 C
Hyderabad
April 28, 2024 17: 47 PM
Slider కర్నూలు

N440K కరోనా వైరస్: మంత్రిపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు

#kurnool police

కర్నూలులో N440K వైరస్ వ్యాప్తి చెందుతుందని రాష్ట్ర మంత్రి అప్పలరాజు ఒక టీవీ డిబేట్ లో చెప్పడం వల్ల తామంతా భయబ్రాంతులకు గురవుతున్నామని కర్నూలు టీడీపీ నాయకుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పోతురాజు రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహా ఫిర్యాదుతో ఒక వ్యక్తి కర్నూలు పోలీసుల వద్దకు వెళ్లగా మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిపై కేసు పెట్టారు. N440K కరోనా వైరస్ పేరుతో మంత్రి తమను ఆందోళనకు గురి చేశారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని మంత్రి చెప్పడం వల్ల తాము ఆందోళన చెందుతున్నామని ఆయన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మంత్రి మాట్లాడారని తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చంద్రబాబు మీద ఏ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారో అదే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు.

Related posts

మంత్రి మల్లారెడ్డి జన్మదినం జరిపిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

అభివృద్ధికి ఆదర్శంగా ఆదర్శంగా నిలవడమే ధ్యేయం

Satyam NEWS

పి.పి.ఆర్ రోగ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment