తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్తలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్ర చేసి విద్యుత్ చార్జీల పెంపుదలపై నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్ కోతలను నివారించాలనే నినాదంతో నిరసన వ్యక్తం చేసి, ఇంటి ఇంటికి కర పత్రాలు అందచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయాయి అన్నది ప్రజలకు వివరించి, గ్రామంలో పర్యటించి గ్రామస్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,అనపర్తి మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధులు వెంకటరామరెడ్డి, సోమరాజు,తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి,అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవాదనరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను,రాష్ట్ర ఎస్సి సెల్ కార్యదర్శి సూర్యప్రకాష్,అనపర్తి నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు స్వామి,మండల పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు రాంబాబు, మండల పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు బాబురావు, గ్రామ శాఖ అధ్యక్షులు లాలయ్య, కృష్ణారావు,వీర్రాజు,దొరబాబు,సతీష్,చక్రధర్, లోవకొండ,శివ,నాగేంద్ర, రామారెడ్డి, సూర్రెడ్డి, బసివిరెడ్డి, సత్తియ్య,సురేష్,మండల & గ్రామ నాయకులు పాల్గోన్నారు.