41.2 C
Hyderabad
May 4, 2024 18: 07 PM
Slider గుంటూరు

వైసీపీ నాయకులకు రాని కరోనా వినాయక భక్తులకు వస్తుందా?

#chadalawada

వేలాది మందితో సమావేశాలు నిర్వహించే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాని కరోనా వినాయక భక్తులకు వస్తుందా అంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ప్రశ్నించారు.

నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశంలో డా౹౹చదలవాడ మరియు టీడీపీ శ్రేణులతో కలిసి  మాట్లాడుతూ పలు సందర్భాల్లో వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అధికారులతో కలిసి వేలాది మందిని పోగుచేసి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు నిర్వహించారని, అయితే వినాయక ఉత్సవాలు నిర్వహించడానికి మాత్రం కోవిడ్ నిబంధనలు వస్తున్నాయని వినాయక మండపాలు ఏర్పాటు కు అనుమతులు రద్దు చేయటం శోచనీయమన్నారు.

వేలాది మంది గుమిగూడితే రాని కరోనా వందల సంఖ్యలో వినాయక మండపం వద్ద చేరితే సోకుతుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొడ్డపాటి పేరయ్య, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి గొట్టిపాటి జనార్దన్ బాబు,పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కుమ్మేత కోటి రెడ్డి యాడ్స్ వాలి, బడే బాబు, ఇమిడిశెట్టి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల  ఘాట్ లో ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్

Satyam NEWS

భీష్మ ఏకాదశి రోజు బాలయ్య భీష్మ గెటప్ ఇది

Satyam NEWS

బర్త్ డే కి న్యూ స్టైలిష్ లుక్ లో అదరకొడుతున్న విక్టరీ వెంకటేష్

Satyam NEWS

Leave a Comment