కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల మంజూరు చేసిన జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని నాగర్ కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా మీదగా జాతీయ రహదారి 167 నిర్మాణం కాబోతుంది.
జాతీయ రహదారి పనుల ప్రారంభానికి బిజెపి నేతలు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన వారిలో నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, అసెంబ్లీ ఇన్చార్జి దిలీపాచారి, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి తదితరులు ఉన్నారు.
బిజేపి నేతల వినతిని స్వీకరించిన కిషన్ రెడ్డి స్పందిస్తూ రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్ అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో అన్ని విషయాలు ప్రస్తావిస్తానని అన్నారు. ఆయన సమయం తీసుకొని వచ్చే నెలలో కర్నూలు జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్షించి పనులు ప్రారంభించేందుకు తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. ఆ వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
వారి హామీ పట్ల భారతీయ జనతా పార్టీ హర్షం ప్రకటిస్తున్నది. నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధికి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి నడుంబిగించారు. వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, దిలీప్ ఆచారి నడుచుకుంటున్నారు. దాంతో ఫలితాలు వేగంగా వస్తున్నాయి.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్