కడప జిల్లా రాజంపేట గాంధీ విగ్రహం వద్ద గురువారం రాత్రి రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగ ల్ రాయుడు ఆదేశాల మేరకు టిఎన్ఎస్ఎఫ్ తెలుగు మహిళ ఆధ్వర్యంలో కోవొత్తులతో నిరసన నిర్వహించారు.
ధర్మవరం మండలం బడన్నపల్లి పొలాల్లో హత్యకు గురైన దళిత మహిళ స్నేహలత సంఘటనకు నిరసన రాష్ట్ర టీడీపీ నేత డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు వినాదాలు చేశారు.
స్నేహలత ను అతి కిరాతకంగా చంపిన హంతకులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు సంజీవ రావు తెలుగు యువత మండలాధ్యక్షులు పాండురాజు, తెలుగురైతు సుబ్బనర్సయ్య, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మురళి, విశ్వనాధ్ , శ్రీనివాసులు రవీంద్ర వర్మ,శశి పాండురాజు, సుబ్బు,బాలరాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.