Slider నిజామాబాద్

మద్నూర్ లో ఆధ్యాత్మిక దినోత్సవం

#madnoor

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ హనుమాన్ ఆలయంలో  ఆధ్యాత్మిక దినోత్సవం బుధవారం జరిగింది. స్వామివారి సేవలో జుక్కల్ శాసనసభ్యులు హనుమంత సిండే జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి హోమంతో ఆధ్యాత్మిక వేడుకలు ప్రారంభించారు.

మధ్యాహ్నం పలు సంస్కృతి కార్యక్రమాల అనంతరం సాయంత్రం మల్లన్న గుట్ట మహారాజ్ అవధూత బసవలింగ వారి ప్రవచనం నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  జుక్కల్ నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధులు అధికారులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేస్తా

Murali Krishna

CRPF జవాన్ల పిల్లలకు స్కూల్ బ్యాగుల పంపిణీ

Satyam NEWS

విమానంలో బట్టలు విప్పేసిన ఇటలీ మహిళ

Bhavani

Leave a Comment