కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామం నుండి మైబాపూర్ గ్రామం తాండ వరకు 2.40 లక్షల నిధులతో వేయనున్న రోడ్డుకు జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వేయడం వలన రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఇరువురితోపాటు ఎంపీపీ యశోద భాయ్ నీళ్లు పటేల్, జడ్పిటిసి లక్ష్మీబాయి దాదారావు పటేల్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సాయ గౌడ్,భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాధవరావు దేశాయి, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్ తో పాటుఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు ఉన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం