ములుగులోని CRPF 58 బెటాలియన్ జవాన్లకు చెందిన పిల్లలకు CRPF అసిస్టెంట్ కమాండెంట్ నందలాల్ ఉచితంగా స్కూల్ బాగ్స్ బుక్స్ క్రికెట్, వాలీ బాల్, బాడ్మింటన్ కిట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా ఏ.ఎస్.పి ములుగు సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. సివిక్ యాక్షన్ కార్యక్రమం లో భాగంగా ములుగు మండలం సర్వపూర్ చిన్నగుంటూరు పల్లి పొట్లపూర్ జగ్గన్నగూడెం గ్రామాలకు చెందిన మొత్తం 200 మంది పిల్లలకు వీటిని పంపిణీ చేశారు.
అదే విధంగా యువకులకు స్కూల్ బాగ్స్ బుక్స్ క్రికెట్ కిట్స్,వాలీ బాల్ కిట్స్,బాడ్మింటన్ కిట్స్ ఉచితంగా అందచేశారు. జగ్గన్న గూడెం, పొట్లపూర్, చిన్నగుంటూరు పల్లి, సర్వపూర్ కు చెందిన వారు దీని ద్వారా లబ్ది పొందారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ములుగు మేకల రంజిత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఓంకార్ యాదవ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.