సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యడవెల్లి వీరబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఇంటిమళ్ళ బెంజమిన్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఎంతో ఆర్భాటంగా గొప్ప కార్యక్రమమని తలపెట్టిన దళిత బంధు నేడు ప్రకటనలకే పరిమితం అయిందని, దళిత బంధు క్రింద మంజూరైన చెక్కులు నేటికీ రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలి ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కెసిఆర్ మాటలు ఎంతవరకు నెరవేరాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి,నేడు దళిత కుటుంబాలలో వెలుగులు నింపటానికి దళిత బంధు ఇస్తానని చెప్పి దళితులను ఒక ఓటు బ్యాంకుగా చూస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.రాజ్యాంగాన్ని మార్చి రాయాలన్న దుర్బుద్ధితో ఉన్న కెసిఆర్ కు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి,కస్తాల ముత్తయ్య,రెడపంగు రాము,కస్తాల రవీంద్ర,మందా నాగరాజు, కందుకూరి రాము తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్