40.2 C
Hyderabad
May 1, 2024 18: 19 PM
Slider వరంగల్

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

#taslima

ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా గ్రామానికి చెందిన మసిక శుభాష్ ఇటీవలే ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న అందించిన ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించారు. తస్లీమా బుధవారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు.

ఆయన మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో  50 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు అందించి సహృదయాన్ని చాటుకున్నారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు ఉన్నారు.

Related posts

ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో భాగంగా ఎస్ ఈ బీ దాడులు

Satyam NEWS

రైతుల ఉసురు పోసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు

Satyam NEWS

అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసు తనిఖీలు

Bhavani

Leave a Comment