రామంతపూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో డ్రైనేజి సమస్య లను సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూస్తానని కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ తెలిపారు. బుధవారం రామంతపూర్ డివిజన్ లోని వెంకట్ రెడ్డి నగర్ , కామాక్షిపురం, పిఎస్ కాలనీలలో అధికారులతో కలసి పర్యటించారు .ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య గురించి అధికారులకు తెలిపారు కాలనీలలో డ్రైనేజి సమస్య త్వరగా పరిష్కరించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఎఈ. సత్యనారాయణ, డిఈ. నాగమణి జంగయ్య స్థానికులు మరియు బిజెపి సీనియర్ నాయకులు వేములకొండ వెంకన్న గౌడ్,పూజారి సోమయ్య గౌడ్ ,డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి దారం వెంకటేష్ గుప్తా, పాశం ప్రవీణ్, ముశిగంపల శివగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్