కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది తప్ప చంద్రబాబు వల్ల కాదని మంత్రులు ధ్వజమెత్తారు. మంత్రులు టి. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, వి. శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, విప్ ఎం. .ఎస్. ప్రభాకర్ రావు నేడు టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కు తెలంగాణ కు చంద్రబాబు వల్లే మొదటి నష్టం, అన్యాయం జరిగిందని అన్నారు.
పోలవరానికి ఏడు మండలాలు గుంజుకున్నది చంద్రబాబు కాదా అని వారు ప్రశ్నించారు. 440 మెగావాట్ల సీలేరు జల విద్యుత్ కేంద్రం ఏపికి కి దక్కించుకుంది చంద్రబాబు కాదా అని వారు ప్రశ్నించారు. ఖమ్మం లో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ కట్టా అని చంద్రబాబు నిరూపిస్తే ముక్కు నేల కు రాస్తామని వారన్నారు. కేసీఆర్ వల్లే ఖమ్మం కు జల వైభవం వచ్చింది.
ఖమ్మం కు ఐటీ తెచ్చింది కేసీఆర్, కేటీఆర్ లే అని అన్నారు. తాము కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నామని తమను చంద్రబాబు ఆగం చేయొద్దని కోరారు. కేసీఆర్ ను ఎదుర్కునేందుకు బీజేపీ రకరకాల ప్రయోగాలు చేస్తోంది ..ఇపుడు బీజేపీ పంపుతున్న నేతల జాబితా లో చంద్రబాబు చేరిపోయాడని వారన్నారు.