హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని హబ్సిగూడ చౌరస్తా లో తిదూడ తెలంగాణ కిచెన్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతీ సుభాష్ రెడ్డి , ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, పీసీసీ కార్యదర్శి జితేందర్ రెడ్డి , డాక్టర్ శిల్పా రెడ్డి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారంలో బాగా రాణించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి వారి మన్ననలను పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు యంజాల అభినవ్ రెడ్డి మాట్లాడుతూ మావద్ద ఆగం ఆగం కోడి వేపుడు, పహిల్వాన్ కోడి వింగ్స్, తాగుబోతు కోడి, దిమాక్ ఖరాబ్ చికెన్, మా యాదాద్రి మాంసం మటన్, ఆగం ఆగం మాంసం వేపుడు, కోడి బిర్యానీ, కోడి కీమా బిర్యాని, మాంసం బిర్యానీ వివిధ రకాల వెరైటీ వంటకాలు తి దూడ తెలంగాణ కిచెన్లో అనుభవజ్ఞులైన మాస్టర్ చెప్పుతో తయారు చేయబడి అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.
టిఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి ,గడ్డం రవి కుమార్ ,గరిక సుధాకర్, బాన్నాల ప్రవీణ్ కుమార్ ముదిరాజ్, చింతల నరసింహారెడ్డి, బిజెపి నాయకులు రెడ్డి గారి దేవేందర్ రెడ్డి, మహంకాళి లక్ష్మణ్ కొల్లు బాల్రాజ్, అభినవ్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జి.శ్రీనివాసరావు, సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి