తొలి విడత తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం సమరయోధులుగా గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బుధ వారం నాడు ఉద్యమకారుల సన్మాన సభ గోడపత్రికను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ఉద్యమంలో దొడ్డి కొమరయ్య తో పాటు ఎందరో ఉద్యమంలో పాల్గొని నాటి నిజాంకుశ పాలన వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆయన అన్నారు ఈ నెల 14న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య తెలంగాణ ఉద్యమకారుల పోరం సభ్యులు ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.