38.2 C
Hyderabad
May 3, 2024 21: 23 PM
Slider ప్రత్యేకం

ఎంపి మాధవ్ పై పరువు నష్టం దావా వేస్తున్న రాధాకృష్ణ

#vemuriradhakrishna

బూతులు తిడుతూ అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై న్యాయ చర్యలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సిద్ధమయ్యారు. రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. అత్యంత జుగుప్పాకరమైన భాషను వాడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరబోతున్నారు.

అదే విధంగా పరువు నష్టం చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఒక మహిళతో ఆయన మాట్లాడుతూ నగ్నంగా ఉండి తన ప్రయివేటు పార్ట్స్ ను ఆయన బహిరంగంగా ప్రదర్శించిన వీడియో ఒకటి లీక్ అయింది.

ఈ వీడియో పై అధికార వైసీపీ నేతలు పలు సందర్భాలలో పలు రకాలుగా మాట్లాడారు. ఆ వీడియో ఒరిజినలా కాదా అనే విషయం తేల్చేందుకు దాన్ని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నిన్న చెప్పారు. అయితే సర్క్యులేట్ అవుతున్నది కాపీ వీడియో కాబట్టి ఒరిజినల్ వీడియో దొరికే వరకూ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేమని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశంలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మాధవ్ కూడా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలను వేమూరి రాధాకృష్ణ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో చర్యలకు రెడీ అయ్యారు.

Related posts

అనారోగ్యంతో ఉన్న నిరుపేదల పాలిట వరం ముఖ్యమంత్రి సహాయనిధి

Satyam NEWS

115V బస్ ను పునః ప్రారంభించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

Satyam NEWS

సుఖ భోగాలకు మార్గం సౌభాగ్యాలకు ద్వారం

Satyam NEWS

Leave a Comment