జర్నలిస్టులకు రైల్వే రాయితీ పునరుద్ధరించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు రైల్వే రాయితీ తీసేశారు. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు ఈ నిర్ణయంపై గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధ వర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు అందించే రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు.