27.7 C
Hyderabad
April 30, 2024 08: 57 AM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టుల రైల్వే రాయితీ కొనసాగింపుకు సిఫార్సు

#radhamohansingh

జర్నలిస్టులకు రైల్వే రాయితీ పునరుద్ధరించాలని రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు రైల్వే రాయితీ తీసేశారు. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు ఈ నిర్ణయంపై గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు వారికి రాయితీ ఛార్జీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. రైల్వేలు సాధారణ స్థితికి చేరుకుంటున్నందున, వివిధ వర్గాలకు చెందిన ప్రయాణికులకు గతంలో అందించిన రాయితీలను తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని కమిటీ కోరింది. సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు అందించే  రైల్వే ఛార్జీల రాయితీలు 2020 మార్చి 20నుంచి రద్దైన సంగతి తెలిసిందే. బీజేపీ లోక్‌సభ ఎంపీ రాధామోహన్ సింగ్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

Related posts

ఇంటర్ డిస్టిక్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోస్టర్ విడుదల

Bhavani

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహ యజమానిగా మారిన విజయ్‌ దేవరకొండ

Satyam NEWS

బ్యాంకుల్లో క‌రోనా నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాలి

Satyam NEWS

Leave a Comment