అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం శ్రీ విరాట్ నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ పోచమ్మ తల్లి టెంపుల్ శంకుస్థాపన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు,బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేమెలి మహేష్, వెంకటేశ్, కర్నాకర్,శివ,శేకర్, బాల రాజు, కాంతారావు, చంద్రమౌళి,సత్యనారాయణ,నవీన్, టైలర్ శ్రీను, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా