నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో 11న కుంభోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశారు. శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి మధ్యాహ్నం వరకు అనుమతిస్తారు. ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం చేసి శ్రీ స్వామి వారి ఆలయ ద్వారాలు మూసి వేస్తారు. శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం సందర్భంగా సాయంత్రం కుంభాహారతి తర్వాత మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతిస్తారు.
previous post