తెలంగాణ రాష్ట్ర ఆటో , వ్యాన్ డ్రైవర్స్ అసోసియేషన్ చర్లపల్లి లోనీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెరాస సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రారంబించారు. ఈ మేరకు అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకున్నారు.
అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా బండారి లక్ష్మారెడ్డి, అధ్యక్షులుగా షేక్ అబ్దుల్ నబీ, ఉపాధ్యక్షులుగా కే ప్రతాప్ రెడ్డి, సారయ్య, జనరల్ సెక్రెటరీగా బి సతీష్, కోశాధికారిగా కె ఉప్పలయ్య, సలహాదారులుగా బి ఇలియాజర్ ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న ప్రతి ఆటో వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని,
వారికి అన్ని సమయాలలో అండగా ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా 400 మంది ఆటో , వ్యాన్ డ్రైవర్లకు ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, సాయి జెన్ శేఖర్, కటార్ల భాస్కర్, నేమూరి మహేష్ గౌడ్, బైరి నవీన్ గౌడ్, వాసుదేవ్ గౌడ్, సుదర్శన్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి