ఈ సారి కాషాయం వెర్సస్ ఎర్రజెండా నేతల ధర్నా
విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద అటు సీపీఐ, ఇటు ఏబీవీపీ లు ధర్నాలతో దద్ధరిల్లింపజేసాయి. తొలుత ఏబీవీపీ కి చెందిన పలువురు ఇంటర్ విద్యార్థిని విద్యార్థులు… దగా ప్రభుత్వం… దిక్కు మాలిన ప్రభుత్వం అంటూ పెద్ద పెట్టున నిని చేసారు. ఒకానొక సందర్భంలో గేట్ ముందున్న బారికేడ్లు తొలగించి లోపలకు చొచ్చుకెళ్లే యత్నం చేయడంతో వన్ టౌన్ సీఐ డా. వెంకటరావు, ఎస్ఐ లు భాస్కర్, గోపాల్, టూటౌన్ ఎస్ఐ ప్రసన్న కుమార్ లు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెల కొంది.అయితే ఏబీవీపీ కి చెందిన నలుగురు స్టూడెంట్స్ మాత్రమే ధర్నా చేస్తామని చెప్పడం తో పోలీసులు కాస్త శాంతించారు. అయినా స్టూడెంట్స్ వెనక్కి తగ్గకపోలడంతో ఇక తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చేశారు.