తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ హన్మకొండ కోర్టు వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రుద్రమదేవి గాయాలపాలయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను 5 గంటలుగా పోలీసులు వాహనంలోనే తిప్పారు.
ఇక బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేసి 13 గంటలైనా ఇప్పటికీ కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు. పోలీసుల అక్రమ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బండి సంజయ్ వాహనాన్ని పోలీసుల సమక్షంలో బీఆర్ఎస్ గూండాలు అడ్డుకుంటూ చెప్పులు విసిరే యత్నం చేసినా పోలీసులు పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలీసులు, బీఆర్ఎస్ గూండాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుత్తారు.. బీజేపీ నేతలు.పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ గూండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర నాయకులు.