41.2 C
Hyderabad
May 4, 2024 16: 19 PM
Slider గుంటూరు

40 ఏళ్ల ఆటోనగర్ వాసులు కల నెరవేర్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

#drgopireddy

నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో ఆటో నగర్ ఏర్పాటుకు నిన్న సీఎం అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ నరసరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డు నందు గల పార్టీ కార్యాలయంలో ఆటో నగర్ అసోసియేషన్ అధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి ఘన సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో నగర్ కోసం ఎన్నో ఏళ్లుగా  నిరీక్షిస్తున్నారు. 2014లో ఆటో నగర్ కోసం మనం అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగిందన్నారు. అప్పుడు అధికారంలోకి రాలేకపోయాం. అనంతరం జరిగిన పరిస్థితులు అందరికీ తెలుసు. 2019లో మళ్లీ తన్ను గెలిపించి జగన్ ని సీఎం గా చేశారని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అవకాశం వచ్చిన ప్రతిసారీ సీఎం ని అడిగాను అని అన్నారు. 

ఆయన కూడా కెన్ బి డన్ అని అన్నారని తెలిపారు. నిన్న భారీగా విచ్చేసిన ప్రజానీకాన్ని చూసి అడిగిన అన్ని కాదనకుండా మంజూరు చేశారని అన్నారు. సిఎం మాట ఇస్తే తప్పరని.. అన్నారు. అందరం కలిసి ఈ ఆటో నగర్ ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కమిటిగా ఏర్పడి ముందుకు సాగుదాం అన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

Bhavani

ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలి

Bhavani

కడియం రామచంద్రయ్య సమక్షంలో బిజెపిలో చేరికలు

Bhavani

Leave a Comment