నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో ఆటో నగర్ ఏర్పాటుకు నిన్న సీఎం అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ నరసరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డు నందు గల పార్టీ కార్యాలయంలో ఆటో నగర్ అసోసియేషన్ అధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో నగర్ కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2014లో ఆటో నగర్ కోసం మనం అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగిందన్నారు. అప్పుడు అధికారంలోకి రాలేకపోయాం. అనంతరం జరిగిన పరిస్థితులు అందరికీ తెలుసు. 2019లో మళ్లీ తన్ను గెలిపించి జగన్ ని సీఎం గా చేశారని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అవకాశం వచ్చిన ప్రతిసారీ సీఎం ని అడిగాను అని అన్నారు.
ఆయన కూడా కెన్ బి డన్ అని అన్నారని తెలిపారు. నిన్న భారీగా విచ్చేసిన ప్రజానీకాన్ని చూసి అడిగిన అన్ని కాదనకుండా మంజూరు చేశారని అన్నారు. సిఎం మాట ఇస్తే తప్పరని.. అన్నారు. అందరం కలిసి ఈ ఆటో నగర్ ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కమిటిగా ఏర్పడి ముందుకు సాగుదాం అన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా