సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ బూరుగడ్డ మాచవరం గ్రామానికి చెందిన గుండు గురవయ్య అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 2,00,000 లక్షల రూపాయల చెక్కును శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, గ్రామ సర్పంచ్ షేక్ సలీమ రంజాన్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి గ్రామ సర్పంచ్ సలీమా రంజాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు గండు సైదులు,మార్కెట్ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య,ఉప సర్పంచ్ శీలం ఆదెమ్మ,గూడెపు నాగలింగం,గండు చిన్న సైదులు,గుండు మంగమ్మ,ప్రవీణ్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్