29.2 C
Hyderabad
May 11, 2024 02: 29 AM
Slider కడప

మూల వంక పాత నేషనల్ హైవే ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

#Moola Vanka

కడప నగరం చింతకొమ్మదిన్నె మండలం మూల వంక వద్ద ఉన్న పాత నేషనల్ హైవే రోడ్డుని బుద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ మాఫియా కప్పగించినఈఈ వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం ఆ రోడ్ ను స్వాధీనం చేసుకోవాలని కడప జిల్లా అఖిలపక్ష కమిటీ మంగళవారం రోజు జిల్లాకు వచ్చిన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్నాకి వినతిపత్రం ఇచ్చింది. రవి శంకర్ రెడ్డి, హరిప్రసాద్, వెంకట్ శివ, నజీర్ అహ్మద్, మాతయ్య తదితర అఖిలపక్ష నేతలు రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈఈ ప్రభుత్వ రోడ్డుని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ మాఫియా కి తన ఇష్టానుసారంగా అప్పజెప్పిన ఈఈ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ఇరువైపులా పూర్తిస్థాయి కాంపౌండ్ నిర్మించిన కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అబద్దాలని పై అధికారులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఈఈ పై చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలియజేశారు.

అక్రమంగా ప్రభుత్వ భూమిలో టౌన్షిప్ నిర్మిస్తున్న బుద్ధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లకి ఈ రోడ్డు ఇవ్వడంతో ఆ రోడ్డు మాదే అనే అభిప్రాయం కలిగించి 3 లక్షలు కూడా సెంటు విలువలేని భూమిని 13 లక్షలు చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ లిమిటెడ్ కు ఈ అమ్ముడుపోయారని తక్షణమే చర్యలు తీసుకోవాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి పి నగర్ కార్యదర్శి మక్బూల్ బాషా, సిపిఐ నాయకులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరీంనగర్ లో టిటిడి బాలాజీ ఆలయ శంకుస్థాపన

Satyam NEWS

కాంట్రవర్సీ: జవాన్ కిసాన్ మధ్య ఎడతెగని పోరు

Satyam NEWS

గుడ్ ఎఫెక్ట్: ఫలితాలను ఇస్తున్న కార్డన్ అండ్ సెర్చి

Satyam NEWS

Leave a Comment