38.2 C
Hyderabad
April 29, 2024 21: 08 PM
Slider కరీంనగర్

కరీంనగర్ లో టిటిడి బాలాజీ ఆలయ శంకుస్థాపన

కరీంనగర్ పట్టణం గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఈ ఉదయం నుండే ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల 20 నిమిషాలకు శంకుస్థాపన జరగబోయే కార్యక్రమంలో విశేష పూజల్ని టిటిడి వేద పండితులు నిర్వహిస్తున్నారు.

అంతకుముందు ఉదయం టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, టిటిడి లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు, ఎంపీ దీవకొండ దామోదర్ రావు సాదర స్వాగతం పలికి దేవాలయ నిర్మాణ ప్రాంగణానికి ఆహ్వానించారు. ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన గజరాజులు కార్యక్రమాన్ని అలరిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ట్రాజెడీ: గ్రామం మొత్తానికి ఫుడ్ పాయిజనింగ్

Satyam NEWS

మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”

Satyam NEWS

వీళ్లు మామూలోళ్లు కాదు హైవే హంతకులు

Satyam NEWS

Leave a Comment