33.2 C
Hyderabad
May 4, 2024 02: 09 AM
Slider శ్రీకాకుళం

నల్ల జీవోను తగలబెట్టిన తెలుగుదేశం

#TDP

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్, హిట్లర్ మాదిరిగా నియంత పాలన చేస్తున్నారని, ర్యాలీలు సభలు రోడ్ షోలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తూ జీవో విడుదల చేయడం దుర్మార్గమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తీవ్రంగా విమర్శించారు. నల్ల జీవో కాపీని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్ధలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి పెను విఘాతమని, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ధర్నాలు నిరసనలు ర్యాలీ చేయకుండా అడ్డుకునేందుకు సీఎం దుష్ట బుద్ధితో ఈ ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను ప్రయోగించి ముందస్తు అరెస్టులు, గృహ నిర్భందాలతో ఉద్యమాలు అపలేరని ముఖ్యమంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు రణస్థలం టిడిపి మండల క్యాడర్ అంతా పాల్గొన్నారు.

Related posts

కొట్టాయంలో రోటరీ క్లబ్ 3160 అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్

Satyam NEWS

శ్రీవారి సేవలో సినీ నటి రమ్యకృష్ణ

Satyam NEWS

బాలాపూర్ రికార్డు బ్రేక్.. అల్వాల్లో  45,99,999 లక్షలు పలికిన లడ్డు

Satyam NEWS

Leave a Comment