38.2 C
Hyderabad
April 29, 2024 20: 28 PM
Slider సినిమా

శ్రీవారి సేవలో సినీ నటి రమ్యకృష్ణ

#ramyakrishna

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీ నటులు రమ్యకృష్ణ, బిత్తిరి సత్తిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన రమ్యకృష్ణతో పోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఫోటోలు తీసుకుంటున్న అభిమానుల ఫోన్స్ ను రమ్యకృష్ణ కుమారుడు తోసేశాడు. ఆలయ బయటకు వచ్చిన బిత్తిరి సత్తితో కర్ణాటక భక్తుడు మీరు ఎమ్మెల్యేనా అంటూ ప్రశ్నించిన భక్తుడితో కాదు కాదు నేను హైదరాబాదు ఎంపీ నంటూ బిత్తిరి సత్తి నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.

Related posts

అచ్చేదిన్ అంటే ఇదేనా ? అధిక ధరలతో ప్రజలు చస్తుంటే…

Satyam NEWS

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమిషనర్ బేటి

Murali Krishna

గానగంధర్వుడికి ఘనమైన నివాళులు

Satyam NEWS

Leave a Comment