మరకత శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు శనవారంతో ముగిశాయి. నవరాత్రులు విభిన్నమైన అలంకార రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా భక్తులకు అభిషేకాలు నిర్వహించారు.
లడ్డు వేలం పాట అంటే బాలాపూర్ లడ్డూ రికార్డు అని అందరికీ తెలుసు. మన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలో బాలాపూర్ రికార్డును సైతం బ్రేక్ చేశారు.
అల్వాల్ సర్కిల్లోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి లడ్డూను 45,99,999 రూపాయలకు డాక్టర్ వెంకటరావు, గీత ప్రియ దంపతులు దక్కించుకున్నారు. ఏకంగా ఒక రూపాయి తక్కువ 46 లక్షలకు లడ్డూ కోనుగోలు చేయడం విశేషం. బాలాపూర్ లడ్డూ రూ. 24.60 లక్షలు పలికింది. పోయిన సంవత్సరం కూడా డాక్టర్ వెంకటరావు, గీత ప్రియ దంపతులకే దక్కడం జరిగింది. ఆ దేవుని కటాక్షం వల్ల ఉన్నత స్థాయిలో ఉన్నామని శ్రీవారి కృపకు తోడుగా ఈ లడ్డును కైవసం చేసుకుందామని వెంకటరావు దంపతులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ నిర్వాకులు పాల్గొన్నారు. ఈ డబ్బుతో అన్న ప్రసాద వితరణకు, ఆలయ అభివృద్ధికి, ఆలయము కావలసిన స్థల సేకరణకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి