29.7 C
Hyderabad
May 3, 2024 05: 34 AM
Slider ప్రత్యేకం

ముగ్గురు సోదరులను కాల్చి చంపిన వ్యక్తి

#policecase

కుటుంబ తగాదాల కారణంగా ముగ్గురు సోదరులను దారుణంగా కాల్చి చంపాడు ఒక యువకుడు. రాజస్థాన్ లోని భరత్‌పూర్ జిల్లాలోని కుమ్హెర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్రోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మూడు రోజుల క్రితం లఖన్ అనే వ్యక్తికి తన సోదరుడు తన్పాల్ తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇది మనసులో పెట్టుకున్న లఖన్ నిద్రిస్తున్న తన్పాల్ కుటుంబంపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో బుల్లెట్ గాయాలతో ముగ్గురు సోదరులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మహిళలతో పాటు మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ శ్యామ్‌సింగ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇందులో గజేంద్ర, సముందర్, ఈశ్వర్ సింగ్ మరణించారు. మృతుడు గజేంద్ర కుమారుడు తేన్‌పాల్‌తో పాటు అతని తల్లి, ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

Related posts

A responsible statement of purpose writing service is a wonderful selection for you

Bhavani

కలెక్టరెట్ లో సోలార్ షెడ్ ప్రారంభం

Bhavani

అమర వీరుల దినోత్సవం సందర్భంగా విజయనగరం లో కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

Leave a Comment