37.7 C
Hyderabad
May 4, 2024 13: 32 PM
Slider విశాఖపట్నం

చిన్న పిల్లలు… మోటార్ బైక్…. హైస్పీడ్… ఇక అంతే…

#RoadAccident

చిన్న పిల్లలు…. మోటారు సైకిలే నడప కూడదు… అయినా వారి తల్లిదండ్రులు ఎలా ఇచ్చారో కానీ మోటార్ సైకిల్ వారికి ఇచ్చారు. త్రిబుల్ రైడింగ్ చేయకూడదు.

అయినా ముగ్గురు పిల్లలు ఆ మోటారు సైకిల్ పై ఎక్కారు. ఓవర్ స్పీడ్ పోకూడదు…… అయినా పోయారు…. అందే చెట్టుకు ఢీకొని ముగ్గురూ మరణించారు.

ఈ దురదృష్టకరమైన సంఘటన విశాఖ పట్నం జిల్లాలో జరిగింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం లోని మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శనివారం అర్ధరాత్రి  రోడ్డు ప్రమాదం జరిగింది.

ముగ్గురు యువకులు మోటారు సైకిల్ పై వెళుతూ బలంగా  చెట్టుకు  ఢీ కొన్నారు.

దాంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లోను, మరొకరు విశాఖ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.

ముగ్గురు విద్యార్థులు 10 వ తరగతి చదువుతున్నారు.

Related posts

రాబోయే సమ్మెను దృష్టిలో ఉంచుకుని HRA లో మార్పులు

Satyam NEWS

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’

Sub Editor

విడుదలకు సిద్ధమైన “బంగారు తెలంగాణ”

Bhavani

Leave a Comment