చిన్న పిల్లలు…. మోటారు సైకిలే నడప కూడదు… అయినా వారి తల్లిదండ్రులు ఎలా ఇచ్చారో కానీ మోటార్ సైకిల్ వారికి ఇచ్చారు. త్రిబుల్ రైడింగ్ చేయకూడదు.
అయినా ముగ్గురు పిల్లలు ఆ మోటారు సైకిల్ పై ఎక్కారు. ఓవర్ స్పీడ్ పోకూడదు…… అయినా పోయారు…. అందే చెట్టుకు ఢీకొని ముగ్గురూ మరణించారు.
ఈ దురదృష్టకరమైన సంఘటన విశాఖ పట్నం జిల్లాలో జరిగింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం లోని మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
ముగ్గురు యువకులు మోటారు సైకిల్ పై వెళుతూ బలంగా చెట్టుకు ఢీ కొన్నారు.
దాంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లోను, మరొకరు విశాఖ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
ముగ్గురు విద్యార్థులు 10 వ తరగతి చదువుతున్నారు.