జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో నేటి తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఖతం అయ్యారు. చుహార్ ప్రాంతంలో భద్రతాదళాలు, పోలీసులు కలిసి కార్డన్ అండ్ సెర్చి ఆపరేషన్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు కార్డన్ అండ్ సెర్చి చేస్తుండగా ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి ఒక ఏకే రైఫిల్, మూడు పిస్తోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో 6 నెలల వ్యవధిలో 116 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు.