33.2 C
Hyderabad
May 15, 2024 22: 07 PM
Slider చిత్తూరు

Road Accident: రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

#RoadAccident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం కేవిపల్లి మం‍డలంలోని గ్యారంపల్లి కస్పా వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

పీలేరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి వైపు వెళ్తున్న ఓ మోటార్ బైక్ అదే మార్గం నుంచి వెళుతున్న ఓ లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.

మరణించిన వారిలో రెండేళ్ల చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు చిన్న గొట్టిగల్లుకు చెందిన శంకరప్ప, హారిక, చిన్నారి లిల్లీగా పోలీసులు గుర్తించారు.

Related posts

బిక్షాటన చేసిన పశ్చిమగోదావరి జిల్లా వీఆర్ఏలు

Satyam NEWS

రాష్ట్ర అధ్యక్షుడు… అడిగితే పార్టీ పరిస్థితి పై చెప్పా…!

Satyam NEWS

వినుకొండ ఎమ్మెల్యే బొల్లాకు తీరని ఆవేదన

Satyam NEWS

Leave a Comment