పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర వీఆర్ఏలు వినూత్న నిరసన బిక్షాటన చేశారు. కనీస వేతనం 21000 అమలు చేయాలని, డీ ఏ తో కూడిన వేతనం ఇవ్వాలని, నామిని లను వీఆర్ఏ లు గా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. అర్హులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరు. తమ విన్నపాన్ని మన్నించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఏలూరు మండలం లో ఉన్న గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో వల్లి సుబ్బలక్ష్మి, రంగమ్మ, రత్తయ్య, రవి, రాజేందర్, బాజీ, నాగేశ్వరరావు, లాజర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post