వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం పొలికెపాడు అడ్డ రోడ్డు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇందులో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించానగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో ఒకరు బుద్దారం గ్రామానికి చెందిన ఆనంద్ (20) గుర్తించారు.
మరొకరు ఏదుట్ల గ్రామానికి చెందిన యువకుడు జుట్టు శివ (27)గా గుర్తించారు. ఇతనికి పెళ్ళి అయ్యింది. భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరొకరిని చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ కు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడు కూడా ఏదుట్ల గ్రామనికే చెందిన యువకుడుగా గుర్తించారు.
అతడిని జుట్టు రాజేందర్(25)గా గుర్తించగా అతని పరిస్థితి విషమంగా ఉంది.