తిరుమల వెళ్లే అలిపిరి కాలి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
జూన్ 1 నుండి 31 వరకు అలిపిరి నడక మార్గాన్ని మూసి వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
అలిపిరి నడక మార్గం మరమ్మత్తుల కారణంగా నడక మార్గాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
కాలినడకన తిరుమలకు చేరుకోవాలనుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గం గుండా చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి మెట్టు మార్గానికి భక్తులు చేరుకునేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.