29.7 C
Hyderabad
May 4, 2024 05: 40 AM
Slider రంగారెడ్డి

బాటిల్ నెక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అదుపు కీలకం


సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేడు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి. శ్రీనివాసరావు ట్రాఫిక్ విభాగం పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పనితీరునును ప్రశంసించారు. ట్రాఫిక్ రద్దీ సమయాలలో బాటిల్ నెక్ ప్రాంతాలలో TTF సిబ్బంది ఉండి ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కల్గకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని వారికి కేటాయించిన రూట్ లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే అంశాలు మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ట్రాఫిక్ రద్దీని నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా క్యారేజ్ వే పార్కింగ్ లను తీయించడం, ఫ్రీ లెఫ్ట్ బ్లాకింగ్, పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేలా చూడటం మరియు జంక్షన్ ల వద్ద ఆటోలు తీయించడం వంటివి చేయడం వలన ట్రాఫిక్ సజావుగా సాగుతుందన్నారు. ఈ బైక్ లు అందరికి విజిబుల్ గా ఉండటం వలన రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర ఉల్లంఘనలు తగ్గాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, SHO లు, ADCP శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ACP హనుమంత రావు పాల్గొన్నారు.

Related posts

కంపెనీలను వెళ్లగొట్టినవారు ఇప్పుడు రమ్మంటున్నారు

Satyam NEWS

బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల ప్రజలు

Satyam NEWS

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా

Satyam NEWS

Leave a Comment