సామాన్య పౌరులతో పాటు ట్రాన్స్జెండర్స్కు కూడా ఉపాధికల్పనలో అవకాశాలు ఇచ్చి, సమాజంలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఈ నెల 15వ తేదీన వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న గట్టుసింగారం గ్రామానికి చెందిన, ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న బత్తుల వీరన్న, లక్ష్మీ దంపతుల కుమార్తె ట్రాన్సజెండర్ బత్తుల శ్రీవాణి, జిల్లా కలెక్టర్ ని సంప్రదించి, ఉపాధికి ఉద్యోగకల్పన చేయాల్సిందిగా విన్నవించుకున్నారు. బత్తుల శ్రీవాణి విన్నపానికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్, ఆమె విద్యార్హత ననుసరించి ఖమ్మం వైద్య కళాశాలలో ఆఫీసు సబార్డినేట్గా నియమించడం జరిగింది.
previous post
next post