Slider గుంటూరు

పోలీసు అమరవీరులకు డా౹౹చదలవాడ నివాళులు

#chadalavada

పల్నాడు జిల్లానరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ,సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్నది పోలీసులేనని చెప్పారు.

పోలీసు వృత్తి అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని డా౹౹చదలవాడ అన్నారు. వృత్తి ధర్మం కోసం కుటుంబాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. కర్తవ్య నిర్వహణలో కొందరు తమ ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని,వారి త్యాగాలు గొప్పవన్నారు. పోలీసు అమరుల కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం,గౌరవించుకోవడం మన విధి అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము,రైతు కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు, రొంపిచర్ల మండల ప్రధాన కార్యదర్శి పులుకురి జగ్గయ్య,రొంపిచర్ల మండల యువత అధ్యక్షుడు గాడిపర్త్తిసురేష్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి,కొల్లి వెంకటేశ్వర్లు,మైనార్టీ నాయకులు మీరవాలి, మాబు,ఉమ్మర్,మొహమ్మద్ రఫీ,బాషా,గడ్డం కరిముల్లా,పుల్లయ్య,రఫీ, దండ శివరామకృష్ణ, ఎస్సీ నాయకులు చితిరాల బాలు,బొడియ్య టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS

సీరియస్ ఎలిగేషన్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మతి భ్రమించింది

Satyam NEWS

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి: తుమ్మల

Satyam NEWS

Leave a Comment