విశాఖ పోలీసు రేంజ్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పఠానికి రేంజ్ డీఐజీ రంగారావు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ఎల్.కె.వి.రంగారావు తన కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. మొట్టమొదటి భాష ప్రయుక్త రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తోనే ఏర్పడినందుకు అందుకు కారణం అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు, అలాగే ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎందరో మహానీయులను స్మరించుకుంటూ ఈ రోజు మనం అందరం ఈ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోతీసుకు వెళ్లడానికి కృషి చేసినటువంటి ఎందరో మహానీయులను కూడా స్మరించుకోవాలి. వారి త్యాగ ఫలాలు మనకు, మన భావి తరాలకు తప్పకుండా అందజేయడంలో పోలీసుల పాత్ర ఎంతో ఉందని, మనం సక్రమంగా పనిచేస్తూ రాజ్యాంగ బద్దంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని అందుకు ప్రతి ఒక్కరు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి మనమందరం పాటుపడదాం అన్నారు.