సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని సి ఐ టి యు కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా నాయకులు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు శీతల రోషపతి మాట్లాడుతూ శ్రమజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి,భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు ప్రధమ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు, ప్రజల మనిషి స్వార్థపరుడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
ఆయన ఆశయాల కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎలక సోమయ్య గౌడ్, వివిధ సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు గుండెబోయిన వెంకన్న, దుర్గారావు,చింతకాయల మల్లయ్య ,కోటమ్మ ,బాలమ్మ ,రాములు, కొండలు తదితరులు పాల్గొన్నారు.